WTC తుది భారత జట్టు : ఓవల్ మైదానంలో జడేజా రికార్డులు

WTC తుది భారత జట్టు (WTC final India squad) : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మరొక కొన్ని గంటల్లో ప్రారంభం అవుతుంది. ఇరు జట్ల సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ఈ మ్యాచ్ ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే రెండు జట్లు బలంగా ఉన్నాయి మరియు ఇరు జట్లకు చాలా ఉత్తమ ఆటగాళ్లను కలిగి ఉన్నారు.

కానీ భారత్‌కు గొప్ప విషయం ఏమిటంటే, వారం రోజుల క్రితం తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకున్న భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓవల్ మైదానంలో అద్భుతంగా రికార్డు కలిగి ఉన్నాడు.

WTC తుది భారత జట్టు : IPL తర్వాత, WTC ఫైనల్ మ్యాచులో ఆడనున్న జడేజా

ప్రస్తుతం భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో అందరూ చేతులెత్తేయడంతో ఫైనల్ మ్యాచ్‌లో తన జట్టును గెలిపించాడు. ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా జడేజా క్రీజులో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ బౌలింగ్ వేస్తున్నాడు.

మొదటి నాలుగు బంతులు మోహిత్ బాగానే బౌలింగ్ వేశాడు. కానీ చివరి రెండు బంతుల్లో జడేజా ఒక సిక్స్, ఫోర్ కొట్టి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టైటిల్ అందించాడు. ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ జడేజాపై భారత జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

WTC తుది భారత జట్టు : ఓవల్ పిచ్‌పై జడేజాకు ఉత్తమ రికార్డు

ఓవల్ పిచ్ స్వింగ్ మరియు ఫాస్ట్ బౌలర్లకు సహాయకరంగా ఉంటుంది. ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లు ఫేమస్ అయితే గత రికార్డుల ప్రకారం జడేజా కూడా ఈ పిచ్‌పై మంచి రికార్డులు కలిగి ఉన్నాడు. రవీంద్ర జడేజా ఓవల్ పిచ్‌పై రెండు మ్యాచ్‌లు ఆడాడు. మొదటిసారిగా, అతను 2018లో ఇంగ్లండ్‌తో ఈ మైదానంలో తన మొదటి మ్యాచ్ ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 79 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 179 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా చూస్తే ఆ టెస్టులో 7 వికెట్లు తీశాడు. రెండోసారి 2021లో ఇంగ్లండ్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేసి రెండు వికెట్లు తీశాడు. ఈ రికార్డులను చూస్తుంటే, ఈ మైదానంలో అతని నుండి చాలా అంచనాలు ఉన్నాయి, అలాగే జడేజాప్రస్తుతం అతను ఉత్తమ ఫామ్‌లో ఉన్నాడు.

WTC తుది భారత జట్టుకు సంబంధించి రవీంద్ర జడేజా ఆటతీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. క్రికెట్ గురించి లేదా ఏదైనా గేమ్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా మీరు Yolo247 బ్లాగ్ చూడండి. 

WTC తుది భారత జట్టు (WTC Final India Squad) – FAQs

1: రవీంద్ర జడేజా ఓవల్‌లో ఎన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడాడు?

A: జడేజా ఓవల్ మైదానంలో 2 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు, అందులో 11 వికెట్లు పడగొట్టాడు.

2: అశ్విన్ ఎన్ని సంవత్సరాల తర్వాత ఓవల్ మైదానంలో ఆడుతున్నాడు?

A: అశ్విన్ తన చివరి మ్యాచ్‌ను 2014లో ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో ఆడాడు, అందులో అతను మూడు వికెట్లు పడగొట్టాడు.

3: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం భారత్‌కు ఎంత మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు?

A: మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ మరియు జయదేవ్ ఉనద్కత్


Please rate the Article
Rating 0

Your page rank: 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Get Your ID !